లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన KTR

-

లండన్, అమెరికా పర్యటనకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బయలుదేరారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్న కేటీఆర్… అలాగే లండన్ లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు.

మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్.అండ్. డి సేవలను అందించే పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) నాలెడ్జ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు కేటీఆర్. తన పర్యటనలో వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలవనున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2 న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచిన కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్ తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news