తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత ను కలిసిన కేటీఆర్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇటీవలే ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. జూన్ 21వ తేదీ వరకు ఆమె రిమాండ్ లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఈనెల 21న జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version