చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ర్యాలీలుగా వెళ్లారు. మరోవైపు హైదరాబాద్ లో నిరసన చేపడుతున్నారు. దీంతో చంద్రబాబు అరెస్టుపై స్పందించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశం అని.. ఆంధ్రా పంచాయితీని అక్కడే తేల్చుకోవాలని చెప్పారు మంత్రి కేటీఆర్. ఏపీ రాజకీయాలకు,తెలంగాణతో సంబంధమేంటి ? ఇక్కడ ర్యాలీలు ఎందుకు?  ఏపీలో చేసుకోండి అని సూచించారు. ముఖ్యంగా రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోండి. ఇక్కడ ఎవరు చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రా పంచాయితీలకు తెలంగాణ వేదిక కానివ్వమని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న  యుద్ధం అని.. మా పార్టీ నేతలు స్పందిస్తే వారి వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదు.. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఏపీలో.. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయండి. ఎవ్వరూ అడ్డుకోరు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్దాంతం చేస్తానంటే ఎలా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news