నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ !

-

నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. నల్గొండ ఎంపీ సీటు రేస్‌లో పటేల్ రమేష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉండగా.. టికెట్ దాదాపుగా కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.

Kunduru Raghuveer as Nalgonda Congress MP Candidate

ఇక అటు మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి వస్తుందో అనే దానిపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అంటూ కొంతమంది ఫ్లెక్సీలు తయారు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.దీంతో మైనంపల్లి హనుమంతరావుకు ఈసారి టికెట్ రాదనే సంకేతం జనాల్లోకి వెళ్ళింది. వాస్తవానికి మొదటి నుంచి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని మైనంపల్లి హనుమంతరావు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొండల్ రెడ్డి రూపంలో… మైనంపల్లి హనుమంతరావు కు ఎదురుదాడి తప్పదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news