లహరి కేసులో బిగ్‌ ట్విస్ట్..మా అల్లుడు బంగారం అంటున్న లహరి తండ్రి !

-

 

నిన్నటి నుంచి తెలంగాణలో లహరి కేసు సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే లహరి భర్త వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే..తాజాగా లహరి కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. నుదిటి మీద గాయం కనపడుతున్నా, పోస్టుమార్టం రిపోర్టులో వల్లబ్ రెడ్డి కొట్టడంతోనే చనిపోయిందని తేలినా.. ఫిట్స్ రావడంతోనే మా అమ్మాయి చనిపోయిందని పేర్కొన్నాడు లహరి తండ్రి జైపాల్ రెడ్డి.

అంతేకాదు… మా అల్లుడు బంగారం అని బుకాయిస్తున్నాడు లహరి తండ్రి జైపాల్ రెడ్డి. వల్లభరెడ్డి పై మాకు అనుమానాలు లేవని.. లహరి మరణం పై వస్తున్న కధనాలు తప్పు అని తెలిపాడు. మా అమ్మాయి ఫిట్స్ రావడంతో గాయాలయ్యాయి. పోలీసులు కావాలని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. మా వల్లే వల్లభ్ రెడ్డి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. మా అమ్మాయిని మంచి కుటుంబంలో ఇచ్చాము. వాళ్ళు మా అమ్మాయిని బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చాడు లహరి తండ్రి జైపాల్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news