తెలంగాణలో BRS కనుమరుగు కాబోతోంది – బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

-

తెలంగాణలో BRS కనుమరుగు కాబోతోందని బాంబ్‌ పేల్చారు బిజెపి ఎంపి లక్ష్మణ్. ఇవాళ మీడియాను అడ్రస్‌ చేశారు లక్ష్మణ్‌. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ప్రజలు ఇచ్చారు…ఫైనల్స్ లో బిజెపి దే విజయం అన్నారు. మోడి విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు…రాహుల్ ను ప్రజలు విశ్వసించ లేదని ఆగ్రహించారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించింది… మోసం చేసింది…

laxman about brs party

ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహించారు. పార్టీలో ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నారన్నారు. దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదు…వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండకల సీట్లు తెలంగాణ లో గెలుస్తామని ప్రకటించారు లక్ష్మణ్‌. తెలంగాణలో అధ్యక్ష మార్పు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని.. కిషన్‌ రెడ్డి చీఫ్‌ గా కొనసాగుతారని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిజెపిని గెలిపించారు… బిజెపి పాలన నచ్చి ఓటు వేశారని వివరించారు బిజెపి ఎంపి లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news