కరోనా సమయంలో లేని నాయకులు ఇప్పుడు వచ్చి కబుర్లు చెబుతున్నారు – పువ్వాడ అజయ్

-

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. సండ్రా వెంకట వీరయ్య నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అని అన్నారు. ఆయన నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని జోష్యం చెప్పారు మంత్రి పువ్వాడ.

దేశానికి ఆహారాన్ని ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని.. అందులో సత్తుపల్లి నియోజకవర్గం ఒకటని అన్నారు. ఇక ఎన్నికల సమయం వస్తుందని కొందరు ప్రజల మధ్యకు వస్తున్నారని.. వారు ప్రజలకు కనీసం కాకరకాయలు కూడా పంచలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. అప్పుడు ఈ నాయకులు ఎటు వెళ్లారని విమర్శించారు. కరోన సమయంలో లేని నాయకులు ఇప్పుడు వచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు మంత్రి పువ్వాడ అజయ్.

Read more RELATED
Recommended to you

Latest news