నేడు ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో లైట్స్ అండ్‌ సౌండ్‌ షో

-

కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్‌ కాలేజీలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెంట్రల్ ఏజెన్సీలకు అందించే సాయం పథకంలో భాగంగా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లైట్‌ అండ్‌ సౌండ్‌, లేజర్‌ షో ఏర్పాటు చేయనున్నారు. ఈ షోలో వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ చరిత్రను అద్భుతమైన టెక్నాలజీ సహాయంతో వివరిస్తారు.

యూనివర్సిటీ చరిత్రను పురవాస్తు శాఖ అందించగా చరిత్రకు సంబంధించిన వాయిస్‌ ఓవర్‌ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అందించారు. ఈ ప్రదర్శన ఉచితంగా తిలకించవచ్చని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశంగా ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తదితరులు పాల్గొంటారు. ఇక కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే గోల్కొండ కోటలో లైట్ అండ్ సౌండ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news