డిసెంబర్ 09 వరకు రుణమాఫీ పూర్తి.. స్పీకర్ ప్రసాద్ కుమార్

-

రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులు డిసెంబర్ 9 కల్లా మాఫీ పూర్తి చేస్తామని అన్నారు. సోమవారం వికారాబాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రంలోని నంది వాగు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి  చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం మండలంలోని మత్స్యకారులతో మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్  పేర్కొన్నారు.

రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి, ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీలు
అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఆడపడుచులకు త్వరలోనే రూ.2,500 గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news