గత నెలలో కుమార్తెలను చంపి పరార్.. ఇవాళ ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

-

గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన పరారయ్యారు. వారి కోసం పోలీసులు ఎంతగానో గాలించినా ఆచూకీ లభించలేదు. కానీ చివరకు తమ ఊళ్లోనే ఇవాళ చెట్టుకు ఉరేసుకుని విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడేనికి చెందిన పి.అనిల్‌ (26), దేవి (22).. గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరి వేసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 10న తమ కుమార్తెలు లోహిత (2), జస్విత(1)కు పాలలో విషం కలిపి హత్య చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం అంకన్న గూడెం సమీపంలోని అడవిలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news