టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం

-

తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే.

2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. ఇక పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వీకి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ వంటి నేతలు  పోటీ ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే క‌స‌ర‌త్తు గత రెండు వారాల క్రిత‌మే పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాజాగా  అధికారికంగా ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news