జీవన్ రెడ్డి వర్గానికి న్యాయం చేస్తాం : మహేష్ గౌడ్

-

జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి చెప్పినట్టు ఫిరాయింపుల చట్టం రాజీవ్ గాంధీ తెచ్చారు. అయితే తెలంగాణ లో ప్రభుత్వాన్ని కూల్చుతాం అని బీజేపీ, BRS హెచ్చరిక జారీ చేస్తుంది. BRS MLA లు ప్రభుత్వంనీ కాపాడతాం అని వచ్చారు. అయితే మేము జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గానికి న్యాయం చేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకే అన్నీ ఇస్తాం అంటే నడవదు. పాత కాంగ్రెస్ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నం.

ఇక కొత్త ఎంఎల్ఏ లకు కూడా మేము చెప్తున్నాం.. పాత వాళ్ళను కలుపుకుని పోవాల్సిందేనని. బీజేపీ చాలా రాష్ట్రాల్లో మెజార్టీ ఉన్న ప్రభుత్వాలని కూల్చారు. అది అందరికీ తెలిసిందే. బీజేపీ వ్యవహారాల శైలి వల్ల.. మనం అలెర్ట్ అయ్యాం. ఇక జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై శ్రీధర్ బాబు నివేదిక ఇస్తారు. జీవన్ రెడ్డి పార్టీ కమిటెడ్ మనిషి. ఆయన ఆవేదనకి అర్ధం ఉంది అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version