రేవంత్ టెన్షన్ తట్టుకోలేక IPS అధికారి మరణించారు – మహేశ్వర్ రెడ్డి

-

రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఒక IPS అధికారి గుండెపోటుతో మరణించారని ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మరణంపై మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. భట్టి విక్రమార్క మీద కాంగ్రెస్ లో కుట్ర జరుగుతుంది…యాదగిరి గుట్టలో కింద కూర్చోబెట్టారు.. ఆయన డ్రైవర్ ను కొట్టారని తెలిపారు. సెకండ్ పోజిషన్ నుంచి భట్టి విక్రమార్క ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

Maheshwar Reddy warns congress

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సిఎం చెబుతున్నారని… వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే…. సిఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారని ఫైర్ అయ్యారు. సెకండ్ పోజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడుస్తున్నారని… భట్టి B ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారన్నారు. చంద్రబాబుకు, రేవంత్ కు సేమ్ పోలికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ మూడు గ్రూపులు ఉన్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news