Mynampally : అజ్ఞాతంలోకి మైనంపల్లి హనుమంతరావు?

-

 

Mynampally : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన రెండు అసెంబ్లీ టికెట్లు కోరగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో తన అనుచరులతో మాట్లాడి వారం రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

ఆయన చెప్పిన డెడ్ లైన్ నేటితో ముగియనుండగా, ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని, నిజామాబాద్ వెళ్లినట్లు అనుచరులు చెబుతున్నారు. కాగా, అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కరెక్ట్ గా కే‌సి‌ఆర్..బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించే ముందే మైనంపల్లి..మంత్రి హరీష్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటుతో పాటు తన కుమారుడుకు మెదక్ అసెంబ్లీ సీటు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news