మేయర్ గద్వాల విజయలక్ష్మికి అర్ధరాత్రి కాల్ చేసి బెదిరించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మికి అర్ధరాత్రి కాల్ చేసి బెదిరించిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బొల్లారంలోని శ్రీరామ్నగర్ బస్తీలో నివసించే రమేష్ ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కి ఫోన్ లో వేధింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని వేధిస్తున్నారని.. ఆమె పి ఆర్ ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు…బొల్లారంలోని శ్రీరామ్నగర్ బస్తీలో నివసించే రమేష్ ను అరెస్ట్ చేశారు.