రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం : మంద కృష్ణ మాదిగ

-

ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్సీ వర్గీకరణ గురించి మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్ లో  అయితే మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా..? అని పేర్కొన్నారు  మంద కృష్ణ మాదిగ. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడు.. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరతాడు. రేవంత్ ఒంటి మీద కండువా ఇప్పటికి మూడు సార్లు మారింది. అంతకు ముందు బీజేపీ అనుబంధ సంస్థలో ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుంది. ఇలాంటి వాడిని మేం ఎలా నమ్మాలి అని సంచలన వ్యాఖ్యలు చేశాడు మంద కృష్ణ మాదిగ.

Read more RELATED
Recommended to you

Exit mobile version