దిల్‌సుఖ్‌నగర్ గణేశ్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

-

హైదారాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి గణపతి మండపం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎ వరికీ గాయాలు కాలేదు.కానీ, మండపం మాత్రం పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఈ ఘటన పీఎన్‌టీ కాలనీలో వెలుగుచూసింది. ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా గణేశ్ మండపాన్ని కాలనీవాసులు అందంగా ముస్తాబు చేశారు.

అయితే, రంగురంగుల కాటన్‌తో మండపం డెకరేషన్ చేయగా..లైటింగ్ అమర్చాక స్విచ్ వేయడంతో షార్ట్ సర్య్కూట్ అయ్యింది. దీంతో మెరుపులు వచ్చి కాటన్ మీద పడగా క్షణాల్లో మండపం అంతటా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో చిన్నపిల్లలు ఐదు నిమిషాల ముందే మండపం దగ్గర నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, మంటలను స్థానికులు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version