గంజాయి కేసులో MIM కార్పొరేటర్ కొడుకు అరెస్ట్..!

-

గంజాయి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు అరెస్ట్ అయ్యాడు. కోటి రూపాయలు విలువ చేసే 319 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఏపీ నుండి హైదరాబాద్ కు 319 కేజీల గంజాయి తరలిస్తుండగా.. భద్రాచలం వద్ద పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పదిమంది నిందితులతో పాటు రెండు కార్లు మూడు బైకులు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కీలక నిందితుడుగా ఉన్న మునావర్ అలీ నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు.

ఇక పెద్దపల్లి కి చెందిన మరో కుటుంబం మొత్తం గంజాయి సప్లై చేస్తుంది. తల్లి అపర్ణ కుమారుడు అఖిల్ గంజాయి విక్రయితలుగా మారి అమ్మకాలు చేస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి 100 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు తల్లి కొడుకులు. అయితే వారు నిజామాబాద్ మునావర్ అలీ కోసమే గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడు మునావర్ అలీపై గతంలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news