BREAKING : మంత్రి గంగుల ప్రచార వాహనంపై దాడి

-

కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పుతో దాడి చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్ కు చెందిన ఎల్ఈడి వాహనం నగరంలోని గోపాల్ పూర్ లో తిరుగుతోంది.

ఈ క్రమంలో ఉపాధ్యాయుడు జగదేశ్వరచారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.కాగా ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి క త్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ తరుణంలోనే నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version