వికలాంగులకు శుభవార్త..స్కూటీ లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

-

వికలాంగులకు శుభవార్త. సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీ లు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, లక్ష రూపాయలు విలువ గల వాహనాన్ని వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారని కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మంత్రి హరీష్ రావు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ అని చురకలు అంటించారు మంత్రి హరీష్ రావు. అవి పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ లు అని ఆగ్రహించారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే సొట్టకాయలకు నెత్తిమీద పొడిచినట్టు తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పాలని ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news