తెలంగాణను తిట్టెవారు కావాలా..? కిట్లు ఇచ్చేవారు కావాలా ? : మంత్రి హరీశ్ రావు

-

పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ గా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్ లు కట్టకుండా కేసులు వేయడం.. అడ్డుకోవడం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు తిట్లు తిట్టేవారు కావాలా..? కిట్లు ఇచ్చేవారు కావాలా ? మీరే తెల్చుకోండి అంటూ పేర్కొన్నారు మంత్రి హరీశ్ రావు.

వచ్చే ఎన్నికల్లో గ్లోబల్స్ కి నోబల్స్ కి మధ్య పోటీ ఉందని మంత్రి పేర్కొన్నారు. 50 ఏళ్లలో అభివృద్ధి దేశంలో మరెక్కడ కూడా జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి సీఎం మనకు ఉన్నందుకు తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు కొందరూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన కేసీఆర్.. వైద్య రంగాల్లో మరింత మెరుగైన సేవలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version