బీఆర్‌ఎస్‌ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్యపై మంత్రి జూపల్లి సంచలన ప్రకటన

-

బీఆర్‌ఎస్‌ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్యపై మంత్రి జూపల్లి సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ ఆరోపణలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు.. బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై పూర్తి వివరాలు తెలియకుండానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.

శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయి ఉన్నాయని… మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదు.. హత్య బాధాకరం అన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో నాపై ఆరోపణలు చేశాడని కేటీఆర్‌ పై మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం నాపై నిందలు వేస్తున్నారు….శ్రీధర్ రెడ్డి ఎలాంటోడో ఊరికి వెళ్లి అడగండి అన్నారు.

కానీ శ్రీధర్ రెడ్డి హత్య తప్పు అన్నారు. శ్రీధర్ రెడ్డి అన్నదమ్ముల పంచాయతీకి నాకేం సంబంధం అని ప్రశ్నించారు. మా కార్యకర్తను కూడా చంపారు…నీలాగే నేను ఆరోపణలు చేయలేదన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన RSP కేసీఆర్ పంచన చేరారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news