బండెక్కి మరోసారి వార్తల్లో నిలిచిన మంత్రి కోమటిరెడ్డి..!

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ వంటి వాహనాలను నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఫోర్ వీల్ బైకు నడిపి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఫోర్ వీల్ బైకు అక్కడ దర్శనమిచ్చింది.

కార్యకర్తల సమావేశం అనంతరం మంత్రి ఫోర్ వీల్ బైకును నడుపుతూ వీధుల్లో తిరిగారు. తమ నాయకుడు వీధుల్లో బైకు నడపడం చూసి అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎప్పుడూ బిజీగా ఉండే మంత్రి కోమటిరెడ్డి సరదాగా బైకు నడపడం చూపరులను ఆకట్టుకుంది. ఈ ఘటన చిత్రీకరించిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version