బతుకమ్మ పండుగను అవమానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బతుకమ్మ పండుగపై సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ.. బతుకమ్మ బతుకమ్మ అంటూ మహిళలు పూల చుట్టు తిరుగుతారు కానీ బతుకమ్మ పూల లోపల బాటిల్ ఉంటుందన్న సంగతి మహిళలకు తెలియదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు అనవసరంగా ఇన్నోవాలు కొనించి వృథా ఖర్చు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో పోలీసు స్టేషన్ కి మూడు, నాలుగు ఎయిర్ కండిషన్ ఇన్నోవా కార్లు కొనిచ్చాడని అన్నారు. అన్ని కార్లు ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేని ఖర్చులు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ లో చేరుతారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version