మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా మధ్య గొడవ..!

-

MLA Palla Rajeshwar reddy : మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపొండి ఆంటూ పల్లా ను బేధిరించారు మంత్రి కొండా సురేఖ. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, సిద్ధిపేట – హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా మధ్య గొడవ చోటు చేసుకుంది.

Minister Konda Surekha vs Janagama MLA Palla Rajeswara Reddy

కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై హరిత హోటల్లో ప్రభుత్వ అధికారిక సమీక్షలో కాంగ్రెస్‌ నేత కొమ్మూరిని స్టేజీపైకి పిలిచారు మంత్రి కొండా సురేఖ. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు.. రాజకీయ వేదిక లాగా ఓడిపోయిన వారిని వేదికపైకి ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపొండి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దింతో ఈ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news