కాంగ్రెస్‌ పార్టీని దళితులు నమ్మే ప్రసక్తే లేదు : మంత్రి కొప్పుల

-

అధికార దాహంతో ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ను దళితులు నమ్మె పరిస్థితిలో లేరని ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ  మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రకటించింది శుద్ధ అబద్ధమని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం దళిత వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నందున బీఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. ఖిలావనపర్తి గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆ గ్రామ సర్పంచ్ సాగంటి తార కొండయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. కొత్తూరులో రజక సంఘ భవనాన్ని, పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు. గ్రామానికి చెందిని మున్నూరు కాపు సంఘం యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ధర్మారం మండలంలోని ఆర్అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు రూ.8.78 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు .

Read more RELATED
Recommended to you

Latest news