కరెంట్ బిల్లు విషయంలో గొడవ.. తండ్రిని చంపిన తనయుడు..!

-

రాష్ట్రంలో రోజురోజుకు చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇంటి కరెంటు బిల్లు విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే.. వికారాబాద్ మండలం అత్తిలి గ్రామానికి చెందిన ఎక్ మామిడి రామచంద్రయ్య (58), కుమారుడు యాదయ్య ఇంటి కరెంటు బిల్లు విషయంలో గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన యాదయ్య ఇనుప రాడ్డుతో తండ్రి రామచంద్రయ్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామచంద్రయ్యను గ్రామస్తులు చికిత్స నిమిత్త వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్రయ్య మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని యొక్క తమ్ముడు కొడుకు లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news