హైదరాబాద్ లో కమాండ్.. బెంగళూరు లో న్యూ కమాండ్.. ఢిల్లీలో హైకమాండ్.. కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

సత్తుపల్లి బీఆర్ఎస్ బహిరంగ సభ.. రాజకీయాల్లో అవకాశాల కోసం అటు ఇటు పోవడం సహజం.. నిన్నటి వరకు కేసీఆర్ దేవుడు అన్నవాడు.. టికెట్లు రాలేదని కేసీఆర్ ను విమర్శిస్తున్నారు.  దేవుడులాంటి కేసీఆర్ ని విమర్శించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 2014కి ముందు పరిస్థితి ఏంటి..? ఇవాళ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 

 ఇక కాంగ్రెస్ వారు  చంద్రుడిని  తీసుకొచ్చి సత్తుపల్లిలో కట్టేస్తాం.. గ్యారెంటీ అని కొత్త డైలాగ్ లు చెబుతున్నారు కాంగ్రెస్. 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ..  ఆ పార్టీకి వారెంటీ అయిపోయింది. ఆ పార్టీకే వారెంటీ లేదు..  ఆ పార్టీ నాయకులకు గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని.. దేశంలో రైతుబంధు అమలు చేస్తున్నారా..? పదవులు ఇవ్వలేదని ఇద్దరూ నేతలు కేసీఆర్ ను తిడుతున్నారు. హైదరాబాద్ లో కమాండ్.. బెంగళూరు లో న్యూ కమాండ్.. ఢిల్లీలో హైకమాండ్.. ఇది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు మంత్రి కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news