ఫ్లై ఓవర్ కూలి గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్ ఎల్బీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో పదిమందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైరామల్ గూడా వైపు నుండి ఫ్లై ఓవర్ పైకి వెహికల్స్ ఎక్కే రాంప్ కుప్పకూలింది.

రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలడంతో దీనిపై పనులు చేస్తున్న కార్మికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గాయపడిన వారికి పూర్తి అండగా ఉంటుందని, చికిత్స కు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version