ఇవాళ సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

-

ఇవాళ సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి.. నివాళులు అర్పిస్తారు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న తరహా కుటీర వ్యాపారం చేసుకునే 128 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందజేస్తారు.ఉదయం 12:30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1650 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల బీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షులు మనోజ్ తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు

Read more RELATED
Recommended to you

Latest news