నా కొడుకు ఛాతీపై ఐటీ అధికారులు కొట్టారు – మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి అస్వస్థత నెలకొంది. ఛాతి నొప్పి రావడంతో మహేందర్‌రెడ్డిని.. సురారంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ తరుణంలోనే.. తన కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు సూరారంలోని ఆస్పత్రికి వెళ్లారు మంత్రి మల్లారెడ్డి. మంత్రితో పాటు ఆస్పత్రికి ఐటీ అధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేమేం దొంగ వ్యాపారాలు చేయడం లేదని ఆగ్రహించారు. నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారని.. అందుకే ఆస్పత్రి పాలయ్యాడని నిప్పులు చెరిగారు. 200 మంది ఐటీ అధికారులు దాడులు చేసారని ఆగ్రహించారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news