సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం : మంత్రి పొంగులేటి

-

సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగలోపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పౌర సన్మానం అత్యంత ఘనంగా జరిగింది.

Minister Ponguleti Srinivas Reddy on indhiramma

మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం జిల్లాకు వెళ్తూ మార్గమధ్యంలోని నకిరేకల్ లో శాసన సభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు పరిసర నియోజక వర్గాల ప్రజలు హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవ ప్రదర్శనలో మాట్లాడుతూ….”ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ ఇప్పటికే అమలు చేసాం. ఈనెల 28న మరో రెండు హామీలను నెరవేర్చబోతున్నాం. మరో 15-20 రోజుల్లో డ్రగ్స్ ముఠాలను పారదోలుతాం. ఇందుకోసం ఇప్పటికే కార్యచరణ చేపట్టాం” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news