ఎచ్చి పొచ్చి నా కొడుకులు కళ్ళు తెరచి చూడండిరా.. మంత్రి అజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ఎచ్చి పొచ్చి నా కొడుకులు కళ్ళు తెరచి చూడండిరా అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాల వాళ్ళైతే RTC ని అమ్మేసేవారు. అయితే RTC ని ఆదుకోవాలని RTC పేరిట పెట్రోల్ బంక్ లు నడుపుతున్నాం అని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే  ఈ నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు అజయ్.


ప్రజలు ఆగం కావద్దు అని, టక్కు తమరా గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు. తట్టెడు మట్టి పోయని వారు మాట్లాడుతున్నారు. మీ మాటలు వినడానికి ఖమ్మం ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అని.. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని పేర్కొన్నారు. గతంలో పదవులు చేపట్టిన వారు ఖమ్మం కు ఏమీ అభివృద్ధి చేయలేదు. మా దగ్గర చాంతాడు అంత అభివృద్ధి లిస్ట్ ఉందని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడని జోస్యం చెప్పారు.  ఖమ్మం జిల్లా నాయకులకు కేసీఆర్ ఎంత చేయాలో అంత సహాయం చేసాడు అని తెలిపారు మంత్రి అజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news