కడుపులు నిండిన నాయకులు బయటకు వెళ్లి పిచ్చికూతలు కూస్తున్నారు – పువ్వాడ అజయ్

-

బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పువ్వాడ అజయ్. కడుపులు నిండిన నాయకులు బయటకు వెళ్లి పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. తట్టెడు మట్టి పోయని వారు కూడా మాట్లాడుతున్నారని.. మీ మాటలు వినడానికి ఖమ్మం ప్రజలు పిచ్చివాళ్లు కాదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అన్నారు పువ్వాడ. గతంలో పదవులు చేపట్టిన వారు ఖమ్మం జిల్లాకు ఏం అభివృద్ధి చేయలేదన్నారు.

పక్క రాష్ట్రాల వాళ్ళు ఆర్టీసీని అమ్మి వేశారని.. ఆర్టీసీని ఆదుకోవాలని తాము ఆర్టీసీ పేరిట పెట్రోల్ బంకులు నడుపుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా నాయకులకు కేసీఆర్ ఎంత చేయాలో అంత సహాయం చేశాడన్నారు పువ్వాడ అజయ్. మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news