ఉపాధ్యాయులందరికీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…. విద్యార్థుల్లో ఇమిడి ఉండే ప్రతిభను వెలికి తీసే పనిని తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తిత్వాన్ని నిర్మించేవానిగా , సమాజ నిర్మాతగా , దేశాన్ని నిర్మించే వ్యక్తిగా వ్యవహరిస్తాడని పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుందన్నారు సబితా ఇంద్రారెడ్డి.ప్రతిభ కనబరుస్తున్న ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుపై భరోసా కలిగిస్తున్నారని తెలిపారు సబితా ఇంద్రారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version