అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు సమయాన్ని వృధా చేస్తున్నారు..!

-

రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే MS.రాజ్ ఠాకూర్ మీడియా సమావేశం ఏర్పాటై చేశారు. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన సమయాన్ని వృధా చేశారు అని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదలను కప్పి పుచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నిరుద్యోగులకు భరోసాను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రామగుండం లో నూతన విద్యుత్ కర్మాగారం తో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రస్తావించాను.స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news