గుంటూరు, నంద్యాలలో దారుణం.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. గుంటూరు, నంద్యాలలో వైసీపీ నేతల హత్యలపై  ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసలకు మారుపేరుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు జగన్. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు.

ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు.. అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో దాడులు చేస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలేనని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఈ దారుణాలు బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news