అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే..!

-

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే తాజాగా మంత్రి జూపల్లి కృష్ణ రావు సమక్షంలో డీసీసీబీ అధికారులతో ఎమ్మెల్యే యెన్నం సమావేశం ఏర్పాటు చేసారు. అందులో అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగి మీద ఫైల్స్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. టైంకు అందరికీ జీతాలు ఇస్తుంటే.. మీరు చేస్తున్న పని ఎంతు అని ప్రశ్నించారు.

ఏసీల్లో కూర్చొని మీ ముందు ఉండే కంప్యూటర్లలో లిస్టుల్లో చెక్ చెయ్యడం కష్టం అవుతుందా అని సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్. ఈ పని కూడా చేతకాకపోతే ఇక మీకు జీతాలు ఇవ్వడం దేనికి.. ఇన్ని ఏళ్ళ నుండి ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు అని సీరియస్ అయ్యారు. మీ రికార్డ్స్ ఏవి కూడా సరిగా లేవు. ఒక మంత్రి వస్తుంటే కూడా రికార్డ్స్ సరిగ్గా ఉంచుకోవాలని తెలివి కూడా లేదా.. ఇంత నిర్లక్ష్యంగా మాకేం సంబంధం లేదు అనే విధంగా పని చేస్తా కష్టం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news