ఎమ్మెల్సీ కవిత ఫోన్లు సీజ్.. ఇంట్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం

-

హైదరాబాద్ బంజారాహిల్స్ కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న ఈడీ, ఐటీ అధికారులు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత వాంగ్మూలం నమోదు చేసారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల  బృందం సోదాలు చేస్తోంది. ఈ సోదాలు ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. 

బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 2 గంటల నుంచి 10 మంది అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన ఈడీ, ఆమె ఫోన్లను సీజ్ చేసింది. మరోవైపు ఆమె న్యాయవాదులు ఇంటికి చేరుకోగా.. అధికారులు వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయటనే ఆపేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news