బీఆర్ఎస్ ఉందే భూములు కబ్జా చేయడానికి..!

-

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యదేచ్చగా చెరువులు కబ్జాలకు గురైనవి. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని హరీష్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు, 111, FTL, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారు.

దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూములను ఇంచు వదలకుండా కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో ముందుకు పోతున్నారు. ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. TRS ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కడితే .. హరీష్ రావు ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీరు ఎందుకు కాళ్ళు ,చేతులు ముడుచుక కూర్చున్నారు. చట్టానికి చుట్టాలు లేరు. ఎవరైనా చూసేది లేదు ఎంత పెద్ద వారిని అయినా వదిలేదిలేదు. కాంగ్రెస్ నాయకులవి కూడా కులగోడుతున్నారు. దూర దృష్టితో దురాక్రమనకు గురైన చెరువులు కుంటలను కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు మహేష్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version