2027లో జమిలీ ఎన్నిక‌ల దిశగా కేంద్రం అడుగులు!

-

2027లో జమిలీ ఎన్నిక‌ల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జ‌మిలీ ఎన్నిక‌ల‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ఏర్పాటు అయింది. పూర్తిస్థాయి ప‌రిశీల‌న అనంత‌రం కేంద్రానికి నివేదిక ఇచ్చిన కోవింద్ క‌మిటీ… జమీలీపై ముందుకు వెళ్తోంది. జ‌మిలీ ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్‌ను (83,85,172,174,356) స‌వ‌రించాల‌ని సూచ‌న‌లు చేశారు.

 

 

బిల్లు పాస్ అవ్వాలంటే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో 67% శాతం స‌భ్యుల మ‌ద్ద‌తులో పాటు 14 రాష్ట్రాల అసెంబ్లీల స‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రి అంటూ కమిటీ వెల్లడించడం జరిగింది.

దీంతో..వ‌చ్చే శీతాకాల స‌మావేశాల్లో పార్ల‌మెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027లో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌తో పాటు దేశ‌మంతా ఎన్నిక‌లు నిర్వ‌హించే ఛాన్స్‌ సమాచారం అందుతోంది. ఈ ఎన్నిక‌లు జ‌రిగిన 100 రోజుల త‌ర్వాత మున్సిప‌ల్‌, గ్రామ పంచాయ‌తీల ఎన్నిక‌లు నిర్వహించేలా ఛాన్స్ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news