నేడు ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి మోడీ

-

Modi to Ujjain Mahankali temple : నేడు ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి మోడీ వెళతారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్నారు మోడీ. ప్రధాని పర్యటన సందర్భంగా నేడు ఉదయం 10.15 వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి.

Modi to Ujjain Mahankali temple in Secunderabad today morning

ప్రధాని మోడీ హైద్రాబాద్ పర్యటన సందర్బంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మొన్న బెంగళూర్ పేలుళ్ల ఘటన దృశ్య హైదరాబాద్ మోదీ పర్యటనలో నిఘా పటిష్టం చేశారు పోలీసులు.

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గంలో దారి మళ్లింపులు చేశారు. నిన్న రాత్రి 7:40 pm నుంచి ఇవాళ ఉదయం 10:15 am వరకు ట్రాఫిక్ డివెర్షన్ ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచన చేశారు. ఈ డైవెర్షన్స్ తో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news