నేను రంగంలోకి దిగితే… డైరెక్ట్ మర్డర్లే : ఫిరోజ్ ఖాన్ సంచలనం

-

ఎంఐఎం పార్టీ నేతల దాడిపై స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. నేను రంగంలోకి దిగితే డైరెక్ట్ మర్డర్ లేదా అటెంప్ట్ మర్డర్ అయితదంటూ హెచ్చరించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. నాపై దాడి ఇది మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అండ దండలు చూసుకొని ఎంఐఎం వాళ్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్.

Feroz Khan Statement on mim and Asaduddin Owaisi

నాంపల్లి నియోజకవర్గంలో అభివృద్దిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ వస్తారా ? అని రెచ్చిపోయారు. నాపై దాడి ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడదాం అన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేను తప్ప ఎంఐఎం పార్టీని ఇంకెవరూ ఎదిరించలేరు, ప్రశ్నించలేరు….ఎందుకంటే ఎవరికీ అంత ధైర్యం లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version