ముస్లింల కోసమే గ్రూప్ 1 పరీక్షను ఉర్దూ లో నిర్వహిస్తున్నారు – ఎంపీ అరవింద్

-

ముస్లింలను గ్రూప్ వన్ ఆఫీసర్లు చేసేందుకే గ్రూప్ 1 పరీక్షను ఉర్దూ లో నిర్వహిస్తున్నారని.. రజాకార్ల పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. ఓ మతానికి లబ్ది చేకూర్చేందుకు కేసీఆర్ కుట్ర అని.. కేంద్రానికి లేఖ రాస్తామని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 111 జీవో అమలుచేస్తామని.. ఒవైసి శాయిస్తే కేసీఆర్ పాటిస్తున్నారని ఆగ్రహించారు.

హిందూ ఆమాజం ఐక్యం కావాలని.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో రైల్వే పనులు అన్నారు. సికింద్రాబాద్ నుంచి కాశీ అయోధ్య లకు ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని.. కేటీఆర్ ఒక పిచ్చోడు.. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 92 వేల కోట్ల నిధులతో రోడ్లు నిర్మించామని.. తెలంగాణలో వివిధ పథకాల కోసం మొత్తం 3లక్షల 94 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉచిత రేషన్ బియ్యాన్నిబ్లాక్ మార్కెట్ చేస్తున్నారని.. కేటీఆర్ కనుసన్నల్లో ఈ దందా నడుస్తోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news