మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరకు ముస్లిం పెద్దలు

-

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరకు ముస్లిం పెద్దలు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతీయేటా పంపించినట్లే అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ… ఉర్స్ షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గా కు చాదర్ పంపించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆజమ్ అలీ తదితర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 

ఇక అటు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి నిన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కి తన ట్వీట్ లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని అయితే ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు.

10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కోరారు! బోరబండ లో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీం ఖాన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు ఆయన అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news