ట్విస్ట్‌ ఇచ్చిన మైనంపల్లి.. బీఆర్‌ఎస్‌ లో ఉంటానని ప్రకటన !

-

నిన్న మంత్రి హ‌రీశ్‌రావుపై మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు తన కొడుకుకు టికెట్‌ ఇవ్వాలని… దాన్ని హరీష్‌ రావు అడ్డుకుంటున్నారని మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు ఫైర్‌ అయ్యారు. అయితే సీఎం కేసీఆర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు మనసు మార్చుకున్నారు.

జాబితా ప్రకటించే వరకు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హనుమంతరావు… ప్రకటన తర్వాత కూల్ అయ్యారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోతానన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన మైనంపల్లి హనుమంతరావు.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత సంబరాలు చేసుకున్నారు. తనకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో… సంబరాలు చేయాలని కూడా తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు హనుమంతరావు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news