నవ్వుల పూలు పూయిస్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్

-

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్ వచ్చేసింది. నవ్వుల పూలు పూయించడానికి వచ్చేసింది. జాతి రత్నాలు ఫేమ్​ హీరో నవీన్ పొలిశెట్టి – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమా ట్రైలర్​ను మూవీమేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. డీసెంట్ కామెడీతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

‘రారా కృష్ణయ్య’ ఫేమ్ దర్శకుడు.. మహేశ్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా ఫీల్​గుడ్ లవ్​స్టోరీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై వంశీకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది.

ఈ సినిమాలో హీరో స్టాండప్ కమెడియన్​గా, హీరోయిన్ ఫేమస్ చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. ‘తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్లి ఎందుకు’, ‘అమ్మాయిలకు ​అబ్బయిలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది .. కానీ అబ్బాయిలకు ఇంత లిస్ట్ ఉండదు అమ్మాయి అయితే చాలు బ్రో’, ‘సీసీ కెమెరా ఉంది, వైరల్ అయిపోతాం’ అనే డైలాగులు ట్రైలర్​కు హైలైట్​గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news