నఫ్రత్‌ కా బజార్ తెలంగాణ : కేంద్రమంత్రి బండి సంజయ్

-

తెలంగాణ సర్కార్ ‘నఫ్రత్ కా బజార్’‌గా మారిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ -1 అభ్యర్థుల అరెస్టులపై సోషల్ మీడియా వేదిక (ఎక్స్) ద్వారా స్పందించిన ఆయన రేవంత్ రెడ్డి సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణాన్ని తెరుస్తానని వాగ్దానం చేస్తే.. తెలంగాణ మాత్రం విద్వేషాల బజార్‌గా మారుతోందన్నారు.రాత్రిళ్లు యువతులను అరెస్టు చేయడానికి మీకు ఎంత ధైర్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగ అభ్యర్థులను లాగడం, కొట్టడం చేసి వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకూ దారుణంగా దిగజారిపోతుందన్నారు. 29 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మీరు పరీక్షను మళ్లీ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను ఆశించే వారి అసలు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించకుండా బలవంతంగా వారి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news