తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండో తారీకు అన్న సంగతి తెలిసిందే. అయితే జూన్ రెండో తేదీన… వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సిద్ధమైంది. మిషన్ 26 డేస్ పేరుతో వరుసగా రాజీవ్ యువ వికాసం ప్రారంభించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం… ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా జూన్ రెండో తేదీన…. మిగిలిన రైతులకు రైతు భరోసా జమ చేయనుంది. ఇక జూన్ మూడో తేదీన… భూ సమస్యలపై ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తుంది. ఇందులో అందరూ పాల్గొని తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన రోజు జూన్ రెండున అన్ని కార్యక్రమాలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.