Nizamabad : 6 హత్యల కేసులో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

-

నిజమాబాద్ వరుస హత్యల నిందితుడు విచారణలో విస్తూ పోయే నిజాలు బయటపడుతున్నాయి. స్నేహితుని ఇంటిపై ఆశతో కుటుంబాన్ని కడతేర్చాడు నర హంతకుడు ప్రశాంత్. హత్యలు చేసి ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాడు నిందితుడు. ఆరు హత్యలు జరగ్గా, ఇప్పటి వరకు మూడు మృత దేహాలే లభ్యం అయ్యాయి. ప్రసాద్ తో పాటు భార్య రమణి, మరో సోదరి స్రవంతి మృత దేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

crime

ఈ నెల 13న కాలిన స్థితిలో యువతి మృతదేహం లభ్యం కావడంతో, కేసును ఛాలెంజ్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. సాంకేతిక అధారాలతో ప్రధాన నిందితున్ని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నరు కామారెడ్డి జిల్లా పోలీసులు. గత నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోట తీసుకెళ్ళి హత్య చేశాడు నర హంతకుడు ప్రశాంత్‌.

Read more RELATED
Recommended to you

Latest news